ఆస్థిలో వాటా కోసం అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాని కొడుకు
గుంటూరు :మానవసంబండాలన్నీ ఆర్థిక సంబందాలే అని మార్స్ చెప్పినట్టుగా తన వాటా ఆస్థిని ఇవ్వలేదని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. మూడు రోజులుగా మృతదేహన్ని ఇంటి వద్దే ఉంచాడు.ఆస్థి పంపకంలో రాజీకుదిరిన తర్వాతే అంత్యక్రియలు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు జిల్లా వడ్డపల్లికి చెందిన కొల్ల వెంకట్రావమ్మకు ఇద్దరు కుమార్తెలు,. నలుగురు కుమారులు.అనారోగ్యంతో రెండవ, మూడవ, నాలుగవ కుమారులు చనిపోయారు. మృతి చెందిన కొడుకు కుటుంబానికి వెంకట్రావమ్మ ఇటీవలే రెండు ఎకరాల వ్యవసాయభూమిని రాసిచ్చింది. అనారోగ్యంతో వెంకట్రావమ్మ శనివారం నాడు మరణించింది.
వెంకట్రావమ్మ మరణించడంతో అంత్యక్రియల నిర్వహాణపై పెద్ద కొడుకు ముందుకు రాలేదు.తన సోదరుని కుటుంబానికి రాసిచ్చిన రెండు ఎకరాల భూమిలో వాటా కావాలని వెంకట్రావమ్మ పెద్ద కొడుకు కొండయ్య డిమాండ్ చేశారు. శనివారం నాడు వెంకట్రావమ్మ మరణిస్తే మూడు రోజులైనా అంత్యక్రియల నిర్వహాణకు ఆయన ముందుకు రాలేదు.
బందువులు , కుటుంబసభ్యులు నచ్చజెప్పినా ఆయన వినలేదు..విషయం పోలీసుల వరకు వెళ్ళింది. వెంకట్రావమ్మ కుమార్తెలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కొండయ్య, వెంకట్రావయ్య తరపు న రెండు వర్గాలు ఎట్టకేలకు రాజీకి వచ్చాయి. తన సోదరుని కుటుంబానికి రాసిచ్చిన రెండు ఎకరాల భూమిలో అర ఎకరం భూమిని కొండయ్యకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీంతో మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించేందుకు కొండయ్య అంగీకరించాడు.