'నంద్యాలలో టిడిపి ఎలా గెలిచిందే దేశం మొత్తం తెలుసు'
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం గొప్పేమీ కాదని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం అన్నారు.
అమరావతి: ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం గొప్పేమీ కాదని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం అన్నారు. 2004 నుంచి 2014 మధ్య జరిగిన ఉపఎన్నికల్లో 40కి పైగా సీట్లలో టిడిపి ఓడిపోయిందని గుర్తు చేశారు.
అంతా లగడపాటి వల్లే, నేనూ విన్నా.. కిరణ్ రెడ్డి చెప్పాల్సిందే: జెడి శీలం
మూడు వంతుల స్థానాల్లో డిపాజిట్టు కూడా టిడిపి దక్కించుకోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఎలా గెలిచిందో దేశమంతా తెలుసని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో టిడిపి గెలవాలని చంద్రబాబు మాట్లాడటం నియంత ధోరణిని తలపిస్తోందన్నారు. సీఎం చంద్రబాబుకుప్రయివేట్ లిమిటెడ్ కంపెనీల వ్యవహారాన్ని ప్రతిపక్షం నిలదీస్తుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే, అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించడం లేదన్నారు.
Comments
buggana rajendranath reddy telugu desam nandyal బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం నంద్యాల
English summary
YSR Congress Party MLA Buggana Rajendranath Reddy on Wednesday said that nation know how Telugu Desam party won in Nandyal by elections.
Story first published: Wednesday, September 13, 2017, 17:56 [IST]