వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్- ఇవాళ నెగెటివ్ గా తేలిన అన్ని కరోనా శాంపిళ్లు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఊరట కలిగించే వార్త చెప్పింది. ఇవాళ ల్యాబ్ లో పరీక్షలకు పంపిన అన్ని కరోనా వైరస్ శాంపిల్స్ నెగెటివ్ గా రావడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి నిర్వహించిన పరీక్షల్లో 24 గంటల్లో 43 పాజిటివ్ కేసులు తేలడంతో ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. వీరి ప్రభావంతో ఇంకా ఎంత మందికి కరోనా సోకి ఉంటుందనే అంచనాతో మరింత అప్రమత్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో ఇవాళ అన్ని శాంపిల్స్ నెగెటివ్..

ఏపీలో ఇవాళ అన్ని శాంపిల్స్ నెగెటివ్..


ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంచనాలకు మించి విస్తరిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అందరికీ తాత్కాలికంగా ఊరట నిచ్చింది. ఇందులో ఇవాళ వివిధ జిల్లాల్లో ల్యాబ్స్ కు పంపిన 96 శాంపిల్స్ అన్నీ నెగెటివ్ గా వచ్చాయి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ఇది ప్రజలతో పాటు ప్రభుత్వానికీ, అధికారులకు పెద్ద ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం కేసుల సంఖ్య..

ప్రస్తుతం కేసుల సంఖ్య..


ప్రస్తుతం ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 87గా ఉంది. ఇందులో నిన్న ఉదయం వరకూ 44 మాత్రమే ఉండగా.. 24 గంటల్లో పరిస్ధితి ఒక్కసారిగా తారుమారైంది. నిన్న రాత్రి తర్వాత వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఏకంగా 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు,అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. అందులోనూ వీరంతా ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే కావడంతో ఆందోళన రెట్టింపైంది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
ఇంకా తేలని బాధితులు..

ఇంకా తేలని బాధితులు..


ఇప్పటివరకూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 500 మందికి పైగా శాంపిల్స్ పరీక్షించగా.. వీరిలో 70 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కానీ మిగతా వారి జాడ ఎక్కడ ఉందన్నది పూర్తిగా తెలియరావడం లేదు. ఇప్పటికే ఢిల్లీ నుంచి లభించిన వివరాల ప్రకారం బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు.. పలు జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి మరీ పరిశీలిస్తున్నారు. వీరి లెక్క తేలితే కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ అసలు పరిస్ధితి తెలియదని చెబుతున్నారు.

English summary
after 43 coronavirus postive cases recorded yesterday night, big relief for andhra pradesh citizens as all samples tested today are found negative. a total of 96 samples were sent to laboratories and all are found negative. already 87 coronavirus cases found postive as on today in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X