చంద్రబాబును వదిలేదు, సుప్రీంకు వెళ్తాం: ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును వదిలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును వదిలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తనను పిటిషన్ వేయడానికి అర్హత లేదని కోర్టు చెప్పిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్పీసీ 190 ప్రకారం తనకు అర్హత ఉందని ఆయన చెప్పారు. ఈ కేసుపై మరోసారి సుప్రీంకోర్టు వెళతామని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబుకు స్టేలు తెచ్చుకోవడం అలవాటేనని ఆయన అన్నారు. 'బ్రీఫ్డ్ మి' అని చంద్రబాబు గొంతు స్పష్టంగా ఉందని చెప్పారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసు: హై కోర్టులో చంద్రబాబుకు ఊరట
రొట్టెల పండగకు వచ్చి ఢిల్లీ పెద్దలను చంద్రబాబు కలిశారని అన్నారు. అయితే, తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఓటుకు నోటు కేసును ఒకే న్యాయమూర్తి విచారించడం లేదని ఆయన తెలిపారు.