ఆమె ఓ ప్రోఫెసర్ : అసభ్యకర మాటలు, అసాదారణ వేదింపులే నైజం
గుంటూరు : గుంటూరు వైద్య కళాశాలలలో గైనకాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంద్యారాణి ఆత్మహాత్యకు ఫ్రోఫెసర్ ఎవివి లక్ష్మి వేదింపులే కారణమని విచారణ కమిటీ తేల్చింది.ఫ్రోఫెసర్ అసాధారణ వేదింపుల కారణంగా వైద్య విధ్యార్థిని ఆత్మహాత్య చేసుకొందని కమిటీ అభిప్రాయపడింది.ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
సుదీర్ఘంగా కమిటీ పలువురిని విచారించి ఈ నివేదికను తయారు చేసింది.ప్రోఫెసర్ లక్ష్మి ఉపయోగించే భాషను పలువురు కమిటీ ముందుంచారు. ఆమె అందరి వద్ద అదే రకమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. అత్యంత ఇబ్బందికరంగా మెడికోలతో ఆమె మాట్లాడేవారని కమిటీ ముందు పలువురు చెప్పారు.
అసభ్య పదం లేనిదే ప్రోఫెసర్ నోరు తెరవదని విచారణలో పలువురు తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని కూడ భార్య భర్తల లైంగిక విషయాకు ముడిపెట్టడం, సెలవులు అడిగినా భర్త లేకుండా ఉండలేకపోతున్నావా అంటూ అసభ్యంగా మాట్లాడేదని విచారణ కమిటీ ముందుకు వచ్చిన వారు తెలిపారు.
ఫ్రోఫెసర్ లక్ష్మీ వ్యవహారశైలి గురించి సహాచర అధ్యాపకులను, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి సిబ్బందిని కూడ కమిటీ విచారించింది.అన్ని విభాగాల వారు కూడ ఇదే రకమైన సమాచారాన్ని లక్ష్మి గురించి ఇచ్చారు.ఈ రకమైన వేధింపులు తట్టుకోలేకే వైద్య విధ్యార్థిని సంద్యారాణి చనిపోయింది.భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త రవి కూడ ఆత్మహాత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకొంటున్నాడు.