వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిగా అమరావతి వేస్ట్.. మంగళగిరి బెస్ట్ .. నిపుణుల కమిటీకి చెప్తా అంటున్న ఎమ్మెల్యే ఆర్కే

|
Google Oneindia TeluguNews

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే , సీఆర్ డీఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలోసంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా మంగళగిరి పేరును ఆయన ప్రతిపాదించారు. ఏపీ రాజధాని అమరావతి కంటే మంగళగిరి బెస్ట్ అన్నారు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి .

లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్లలీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్ల

తుళ్ళూరు , వెలగపూడి వంటి ప్రదేశాలతో పోల్చి చూస్తే అన్ని రకాలుగా భవన నిర్మాణాలకు మంగళగిరి అనుకూలం అని ఆయన పేర్కొన్నారు. అమరావతి వేస్ట్ అని మంగళగిరి బెస్ట్ అని చెప్పిన ఆయన అందుకు గల కారణాలను కూడా వివరించారు. మంగళగిరి చాలా ఎత్తైన కొండ ప్రదేశం అని , ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉందని చెప్పారు. రాజధాని అమరావతితో పోలిస్తే దూరం కూడా చాలా తక్కువ అని పేర్కొన్నారు. అంతే కాదు జాతీయ రహదారులకు సమీపంలో ఉందని ఆయన పేర్కొన్నారు.దీని వల్ల రావాణా సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఇక మంగళగిరి ముంపుకు గురయ్యే చాన్స్ లేదన్నారు.

Amaravathi waste as capital ... Mangalagiri the Best .. MLA RK says

మంగళగిరిలో సుమారు 10వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు , అటవీ భూములు ఉన్నాయని ఆళ్ళ చెప్పారు. ఇక గతంలో శివరామ కృష కమిటీ నివేదిక అమరావతి రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదని ఇచ్చినప్పటికీ గతప్రభుత్వం కమిటీ నివేదిక కు వ్యతిరేకంగా అమరావతిలో నిర్మాణం చేశారని పేర్కొన్నారు. భవిష్యత్ నిర్మాణాలు మంగళగిరిలో చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళగిరి భారీ నిర్మాణాలకు అనుకూల ప్రాంతం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రాజధాని విషయంలో ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ అభిప్రాయం అడిగితే కచ్చితంగా మంగళగిరి పేరును ప్రతిపాదిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్ డీఏ చైర్మన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

English summary
YSRCP MLA Rama Krishna said Mangalagiri is the ideal place for the construction of the state buildings when compared with places like Thulluru and Velagapudi. YSRCP MLA has proposed the name of Mangalagiri constituency as the capital of the state Andhra Pradesh. While stating the reasons for it, YSRCP MLA said it is situated in the uplands and it is situated in between Guntur and Vijayawada. Mangalagiri is easily accessible as it is near to National Highways, YSRCP MLA said. He further said that in Mangalagiri, around 10,000 acres of government land is available.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X