గవర్నర్కు చేరిన రాజధాని వివాదం ... తరలింపు నిలిపివేయాలంటూ రైతుల మొర
అమరావతి రైతుల అందోళనలు తోమ్మిదో రోజు కూడ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ... రైతులు గవర్నర్ కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంధర్భంగా అమరావతిలో జరగుతున్న పరిణామాలు గవర్నర్కు వివరించారు. గత ప్రభుత్వం అడిగిన తర్వాతే తాము భూములు ఇచ్చామని ..అయితే ప్రభుత్వం రాజధానిని తరలించడం ద్వార అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు. రాజధాని తరలింపుపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
మరోవైపు రాజధాని నిర్మాణానికి ముప్పైవేల ఎకరాలు కావాలని చెప్పారని, అమరావతిపై చర్చజరిగిన సంధర్భంలో జగన్ రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో కొనసాగించందేకు అంగీకరించారని తెలిపారు. కానీ సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత యూ టర్న తీసుకున్నారని అన్నారు. దీంతో తమ జీవీతాలు రోడ్ల పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక అంతకు ముందు అమరాతవతిలో ఆందోళన చేస్తున్న ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు రయాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా విశాఖలో ఎక్సక్యూటిట్ కాపిటల్ అభివృద్దికి నిధులు మంజురు చేయడంతో పాటు అధికారిక ప్రకటనలు చేస్తున్నారు.