కిషన్ రెడ్డిని కలిసిన అమరావతి రైతులు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అమరావతి రైతులు కలిశారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిందిగా ఆయన్ను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని హమీ ఇచ్చారు. అనరంతరం ఆయన మీడీయాతో మాట్లాడుతూ... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు తనను కలిశారని, భూములు ఎప్పుడు అభివృద్ది చేస్తారని, దీంతోపాటు తమకు కేటాయించిన భూములు ఎప్పుడు ఇస్తారని అవేదన చెందుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారని వివరించారు..రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని కిషన్ రెడ్డి అన్నారు. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే భూములు ఇచ్చిన రైతులకు విశ్వాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు న్యాయం జరిగేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని హామి ఇచ్చినట్టు చెప్పారు. అనంతరం కిషన్ రెడ్డిని కలిసిన రైతులు రాజధాని పేరును మ్యాప్లో చేర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.