వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలంలో బయటపడ్డ గుప్తనిధి: గుంత తవ్వుతుండగా.. అనూహ్యంగా!

50 పంచలోహ నాణెములు, 18 బంగారు నాణెములు, అర కిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు,147 వెండి నాణెములు, ఒక కుంకుమ భరిణి బయటపడ్డాయి.

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం: ఆలయ మరమ్మత్తుల్లో భాగంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో చేపట్టిన తవ్వకాల్లో ఓ గుప్తనిధి బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీశైలం మహాక్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణంలో భాగంగా గుడి వెనుక భాగంలో ఉన్న మఠంలో ఈ నిధి బయటపడింది.

మరమ్మత్తుల్లో భాగంగా కొంత లోతుగా గుంతలను తవ్వడంతో ఒక వెండి గిన్నె బయటపడింది. ఇందులో 50 పంచలోహ నాణెములు, 18 బంగారు నాణెములు, అర కిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు,147 వెండి నాణెములు, ఒక కుంకుమ భరిణి ఉన్నాయి. దీంతో తవ్వకాల్లో బయటపడ్డ నిధి వివరాలను స్థానిక తహశీల్దారుకు తెలియపరిచారు.

Ancient treasure found at Srisailam

అనంతరం పోలీసుల సమక్షంలో ఆలయ అధికారి ఒకరు నిధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం లభ్యమైన నిధి ఏ కాలానికి సంబంధించిందో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అదే సమయంలో తవ్వకాల్లో మరిన్ని నిధులు బయటపడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ అధికారులు తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు.

English summary
Ancient treasure was been unearthed at Srisailam on Wednesday. The treasure was found at the surrounding areas of Ghantaravam around Mallikarjuna Swamy temple where Jeernodharna works pertaining to Ghanta Matham are going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X