ఏపీ కేబినెట్ భేటీ - 2020-21 సాధారణ, వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం...
2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం సచివాలయంలోని కేబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్ కు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్ తో పాటు 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 2020-21కు సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Recommended Video
మరోవైపు
ఇవాళ
కేబినెట్
సమావేశంలో
ఆంధ్రప్రదేశ్
స్టేట్
ఆక్వాకల్చర్
డెవలప్మెంట్
అథారిటీ
యాక్ట్
-2020
కోసం
ఉద్దేశించిన
బిల్లును
శాసనసభలో
ప్రవేశపెట్టేందుకు
ఆమోద
ముద్ర
పడింది.
ఆక్వాకల్చర్లో
మానిటర్,
ప్రమోట్,
రెగ్యులేట్
మరియు
డెవలప్మెంట్కోసం
ఈ
చట్టం
తీసుకు
వస్తున్నారు.
అసెంబ్లీలో
బడ్టెట్
కు
ఆమోదం
లభించిన
తర్వాత
ఈ
బిల్లును
సభలో
ప్రవేశపెట్టి
ఆమోదించబోతున్నారు.