అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.550కోట్లకు పైగా అక్రమాస్తులు: గొల్ల వెంకట రఘు సస్పెన్షన్‌

అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టైన ఆంధ్రప్రదేశ్‌ పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు గొల్ల వెంకట రఘును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టైన ఆంధ్రప్రదేశ్‌ పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు గొల్ల వెంకట రఘును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సెప్టెంబరు 26 నుంచి ఈ సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంది.

'అవినీతి' రఘు: అనంతలో 75ఎకరాలు, ఆరుగురు బినామీలు, 550కోట్లపైనే..'అవినీతి' రఘు: అనంతలో 75ఎకరాలు, ఆరుగురు బినామీలు, 550కోట్లపైనే..

ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా రఘు స్టే పొందడాన్ని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రైబ్యునల్‌, హైకోర్టుల్లో కేవియట్‌ దాఖలు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం ప్రస్తుత సంచాలకుడిని ఆదేశించింది.

Andhra Pradesh country and town planning director golla venkata raghu suspended

కాగా, సెప్టెంబరు 25న రఘు అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. సెప్టెంబర్ 26న అరెస్టు చేసి విశాఖపట్నం న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆ న్యాయమూర్తి అక్టోబరు 9 వరకూ రిమాండ్ విధించారు.

షాక్: అవినీతి అనకొండలకు ఆ ఇద్దరు మంత్రుల అండ!(పిక్చర్స్)షాక్: అవినీతి అనకొండలకు ఆ ఇద్దరు మంత్రుల అండ!(పిక్చర్స్)

ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసును వివరిస్తూ సస్పెండ్‌ చేయాలని ఏసీబీ శాఖ కోరగా ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఏసీబీకి చిక్కిన రఘు రూ.550కోట్లకుపైగా అక్రమాస్తులను కూడబెట్టిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh country and town planning director golla venkata raghu has been suspended by the state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X