షాక్: తెలంగాణ ఎన్జీవో చీఫ్ విఠల్ ఎపికి కేటాయింపు
ఉద్యోగుల పంపకాల్లో గురువారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విఠల్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. దీనిపై విఠల్ స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనను ఆంధ్రా ఇంటర్ బోర్డుకు మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇంటర్ విద్యాశాఖ విభజనలో జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలను ఆంధ్రాకు తరలించేందుకు తెర వెనుక కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తనను సీమాంధ్రకు కేటాయించడంపై మరో పోరాటానికైనా సిద్ధమన్నారు.
జాగృతి మరొకరికి అప్పగిస్తానన్న కవిత
నిజామాబాద్ నుండి లోకసభకు ఎన్నికైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. జాగృతి బాధ్యతలను మరొకరికి అప్పగిస్తానని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జాగృతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాతంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధమవుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.