లోక్సభ స్థానాల్లోనూ కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ హవా
Recommended Video
అమరావతి: అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణంగా దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ సీపీ ఆధిక్యతను కనపరచడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే.
అనంతపురం లోక్సభ స్థానంలో మాజీ ప్రభుత్వ అధికారి తలారి రంగయ్యను బరిలో దింపారు. హిందూపురం స్థానంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఎస్ఐ గోరంట్ల మాధవ్కు టికెట్ ఇచ్చారు. వారిద్దరూ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు. పైగా రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ- వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసం చేశారు. వారిని బరిలో దింపారు.
చంద్రబాబు..వైఎస్ జగన్..పవన్: ఎవరి ఇళ్లల్లో వాళ్లు! కౌంటింగ్ పర్యవేక్షణ అక్కడి నుంచే
ప్రారంభ ఓట్ల లెక్కింపును బట్టి చూస్తోంటే- వైఎస్ జగన్ చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఈ రెండు చోట్లా వైఎస్ఆర్ సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అనంతపురం లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. హిందూపురం లోక్సభ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప మరోసారి బరిలో దిగారు. నిమ్మల కిష్టప్ప వరుసగా రెండుసార్లు హిందూపురం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తిరుపతి, బాపట్ల, కడప, కర్నూలు, నంద్యాల, అరకు, నెల్లూరు, రాజమండ్రి వంటి లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ సీపీ.