ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాల్లో 5 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలే. గత 4 రోజుల్లో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 7.9 శాతం పెరుగుదలతో రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Recommended Video
గత వారం రోజుల్లో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. మొత్తం పాజిటివ్ కేసులు 50 వేలు కాగా.. 40 శాతం అంటే 20 వేల పాజిటివ్ కేసుల్లో వారం రోజుల్లోనే నమోదవడం గమనార్హం. ఇది వైరస్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కన్నా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ కేసులు పెరగడంతో ఎక్కువ నమోదవుతున్న జాబితాలో ఏపీ ఐదో స్థానంలోకి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక.. ఒకటి, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం 3.4 శాతం జాతీయ వృద్దితో 40 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 5వ తేదీ తర్వాత మరోసారి 40 వేల మార్క్ పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య 11.18 లక్షలకు చేరగా.. 7 లక్షలకు పైచిలుకు మంది వైరస్ తగ్గింది. కానీ 27 వేల 500 మంది చనిపోయారు.