అందుకే ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, మేలు చేశారు: గంటా కారును అడ్డుకున్న విద్యార్థులు
ఏయూ సంస్కృత విభాగం ప్రొఫెసర్ ఏడుకొండలును విభాగాధిపతి హోదా నుంచి తొలగించి అనంతరం ఆయనపై విచారణ కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ: ఏయూ సంస్కృత విభాగం ప్రొఫెసర్ ఏడుకొండలును విభాగాధిపతి హోదా నుంచి తొలగించి అనంతరం ఆయనపై విచారణ కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
ఏయూ షాక్: ముందువరుసలో అమ్మాయిలు, బాత్రూంలో కండోమ్స్, క్లాస్లో ఆ పాఠాలు
గంటాను అడ్డుకున్న విద్యార్థులు
మంగళవారం ఏయూలో జరిగిన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో సంస్కృత విభాగం విద్యార్థినులు, పరిశోధకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంత్రి గంటా శ్రీనివాస రావు కారును అడ్డగించారు. ఆయన కారు ఎదుట ముందు బైఠాయించారు.
అందుకే మళ్లీ లైంగిక వేధింపులు
ఏడుకొండలును విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. గతంలో ఆరోపణలు వచ్చినప్పడు యూనివర్సిటీ యాజమాన్యం తగిన విధంగా స్పందించకపోవడం వల్లే మళ్లీ లైంగిక వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నప్పటికీ అటెండెన్స్ వేయడం లేదని ఆరోపించారు.
అలా ప్రొఫెసర్కు మేలు చేశారు
ఆయనపై గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సర్వీసు రిజిస్టర్లో రాయకుండా ఆయనకు మేలు చేశారని విద్యార్థులు మండిపడ్డారు. ఈ మేరకు గంటాకు వినతిపత్రం ఇచ్చారు.
ఏం చర్యలు తీసుకోవాలో చెప్పిన గంటా
దీనిపై మంత్రి గంటా మాట్లాడారు. పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వర రావును ఆదేశించారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తన నిర్ణయం చెప్పారు. ఏడుకొండలును తొలుత విభాగాధిపతి పదవి నుంచి తొలగించి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.