వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం తీరు నిరసిస్తూ విజయవాడలో ధర్నా చెయ్యాలని చంద్రబాబు సంచలన నిర్ణయం .. నిరసన అందుకేనట

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇంకా ఎన్నికల ప్రచారానికి పట్టుమని 6 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో ప్రచారంలో జోరు పెంచిన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

<strong>హైదరాబాద్ సభలో పవన్ సంచలనం .. కేసీఆర్ ను తిట్టినోళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారు</strong>హైదరాబాద్ సభలో పవన్ సంచలనం .. కేసీఆర్ ను తిట్టినోళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారు

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ, ఆయన నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా పలువురు టీడీపీ నాయకులపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు జరుగుతున్నాయి . మొన్నటికి మొన్న రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరి కి చెందిన 315 కోట్ల విలువ గల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అంతే కాకుండా టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులతో పాటు నారాయణ విద్యా సంస్థల్లో , రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు . వైసీపీతో కుమ్మక్కయిన బీజేపీ, ఈసీని వాడుకుంటూ ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

Andhrapradesh CM Chandrababu naidu sit on protest in vijayawada against it raids on TDP candidates

ఈ నేపధ్యంలోనే కేంద్ర సంస్థల దాడులకు నిరసనగా ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకునారు చంద్రబాబు నాయుడు . కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ తమపై దాడులకు యత్నిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసే కుట్రలో భాగంగా కేంద్ర సంస్థలను రంగంలోకి దింపింది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈసీ కూడా కేంద్రానికి తగ్గట్టుగా పని చేస్తుందని ఆరోపిస్తున్నారు.
English summary
Andhra Pradesh CM N Chandrababu Naidu to sit on protest in Vijayawada over reported IT raids on TDP candidates and supporters . In the last few days, many TDP leaders have been attacked by IT and ED officers. Sujana Chowdary, a member of the Rajya Sabha, had earlier attached the assets worth Rs 315 crore by ED. TDP candidates Ugra Narasimhareddy, Putta Sudhakar Yadav, Rajya Sabha member CM Ramesh residence and others have been searched. TDP claims that these attacks are being used by the BJP, which has been in support of YCP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X