రంగుమారిన అన్నా క్యాంటిన్లు...
టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటిన్ల రంగు మారుతోంది... టీడీపీ హాయంలో ఉన్న పసుపు రంగుతో పాటు ఓవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ఫోటోలతో ఉండేవి.. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలో క్యాంటిన్లకు ఉన్న పసుపు కలర్ను మార్చి వైట్ కలర్ వేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలతోనే రంగులు మార్చుతున్నట్టు సమాచారం.
పేదలకు 5 రుపాయలకే అన్నం వడ్డించేందుకు టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే... అయితే ఆ క్యాంటీన్లకు పసుపు రంగుతోపాటు ఎన్టీఆర్తోపాటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను కూడ వేశారు. తాజగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో వాటి రంగు మార్చడం తోపాటు పేర్లను కూడ మార్చేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ఉన్న అన్నా క్యాంటిన్లకు తెల్ల రంగు వేస్తున్నారు.
ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్ల రంగును మారుస్తున్న ప్రభుత్వం త్వరలో పేర్లను కూడ మారుస్తారనే ప్రచారం కూడ జరుగుతోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఖారారు చేయనుంది. కాగా క్యాంటిన్లు ఏర్పరచి సంవత్సరమే అయిన నేపథ్యంలో అప్పుడే రంగులు మార్చడంపై పలువురు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.