వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత ... రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్న రైతులు

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతిలో ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలు రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించాలని వెళ్ళిన క్రమంలో రైతుల ధర్నాతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు భూములు ఇస్తామంటూ అమరావతి పరిధిలోని మందడం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో రైతులు వారిని అడ్డుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులను అడ్డుకుని, వారి కార్లను నిలిపివేశారు. సర్వే చెయ్యకుండా అడ్డుకున్నారు.

వైజాగ్ రాజధాని మాత్రమే కాదు సీఎం జగన్ నిర్ణయంతో అలా కూడా అభివృద్ధి బాటలోవైజాగ్ రాజధాని మాత్రమే కాదు సీఎం జగన్ నిర్ణయంతో అలా కూడా అభివృద్ధి బాటలో

అమరావతిలో భూముల్ని సర్వే చేసేందుకు వచ్చిన తహసీల్దార్‌, ఇతర రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్న రాజధాని రైతులు తమ భూములు ఎలా సర్వే చేస్తారంటూ వచ్చిన అధికారులపై మండిపడ్డారు. సర్వే చేయనిచ్చేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు . రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. రాజధాని రైతులకు సర్ది చెప్పే యత్నం చేసినా ఆందోళన విరమించకపోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Another tension in the capital villages ... The farmers stopped the revenue officials survey

ఇక రాజధాని గ్రామాల రైతులు తమ భూములను ఇచ్చింది రాజధాని కోసమని, పేదలకు ఇళ్ల పట్టాలుగా పంచేందుకు కాదంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పేదలను ఇక్కడకు తీసుకొచ్చి పట్టాలిస్తామంటే ఎలాగని వారు అధికారులను నిలదీస్తున్నారు. తాము పేదలకు పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని అయితే తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఒకపక్క రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కావాలని ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వేలను చేయనిచ్చేది లేదన్నారు రాజధాని రైతులు. మరోవైపు అధికారులు రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు

English summary
The tense situation in the capital's Amaravati slowed down with farmers dharna in the wake of the latest revenue officials to conduct a survey. Revenue officials conducted surveys in the mandadam and Krishnayapalem villages of Amaravati to give land to the poor. The farmers blocked them and turned on the dharna on the road and Prevented the officials from surveying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X