ఏపీ లైవ్ అప్డేట్స్: గవర్నర్, కేసీఆర్తో జగన్ భేటీ, ఆత్మీయ స్వాగతం పలికిన కేసీఆర్
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జోరు కొనసాగింది. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈనెల 30వ తేదీన విజయవాడలోనే ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ స్పష్టం చేశారు. ఈ విజయం దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైందని జగన్ చెప్పారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా తమ అధినేత జగన్ను కలిసేందుకు తాడేపల్లికి క్యూకట్టారు. దీంతో తాడేపల్లిలోని జగన్ నివాసం కిటకిటలాడుతోంది. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో జగన్ తన కేబినెట్ను కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
శుక్రవారం తన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు జగన్. ఇక శనివారం వైసీపీ శాసనసభాపక్షం సమావేశమై జగన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం 30వ తేదీన కొత్త ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
14th Andhra Pradesh Legislative Assembly dissolved
— ANI Digital (@ani_digital) May 25, 2019
Read @ANI Story | https://t.co/ooXmzxHe2u pic.twitter.com/Y5e4mT2x3J