లైవ్: మండలి రద్దుపై సోమవారం చర్చిద్దామన్న సీఎం జగన్..సభను వాయిదా వేసిన స్పీకర్
అమరావతి:ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరొక రోజుకు పొడిగించడం జరిగింది. ఉదయం ప్రారంభమైన సభలో ముందుగా అమ్మఒడిపై సభలో చర్చ జరిగింది. అనంతరం విద్యాహక్కు చట్ట సవరణ బిల్లును మరోసారి పాస్ చేయించడం జరిగింది. అనంతరం బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సభలో చర్చించారు. టీడీపీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా దారుణమని సభ్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు చంద్రబాబు గ్యాలరీలో వచ్చి కూర్చొని మండలి ఛైర్మెన్ను ప్రభావితం చేశారని సభ్యులు మండిపడ్డారు. ఇక చివరిగా మాట్లాడిన సీఎం జగన్.. నిన్న పరిణామాలు తనను బాధించాయని చెప్పారు. అదే సమయంలో బిల్లులపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు మాత్రమే పెద్దల సభ ఉందని చెప్పిన సీఎం జగన్... బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి అడ్డుకునే కుట్రను చేశారని మండిపడ్డారు. సభలో బుధవారం మండలి ఛైర్మెన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.
మరోవైపు మండలి ఛైర్మెన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. విచక్షణాధికారం పేరుతో ఛైర్మెన్ అసహ్యంగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక
గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మినిట్ టూ మినిట్ అప్డేట్స్ మీకోసం.