అసెంబ్లీ చివరి రోజు హైలైట్స్ : ఏపీ శాసనమండలి రద్దుకు శాసనసభ ఆమోదం.. నిరవధిక వాయిదా
అమరావతి:ఊహించిందే జరిగింది. ముందు నుండి చెబుతున్నట్లుగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశమే ప్రధానం అజెండాగా సమావేశమైన కేబినెట్ తొలి అంశంగా దీని పైనే చర్చ చేసింది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మండలి పరిణామాల పైన ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. ప్రజా మేలు కోసం తీసుకొనే నిర్ణయాలకు అడ్డు చెప్పే మండలి అవసరం లేదని పలువురు మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. దీంతో..కేబినెట్ ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానంను ప్రవేశపెట్టారు. అనంతరం సుదీర్ఘంగా మండలి రద్దు తీర్మానంపై చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు సభకు హాజరుకాలేదు. చివరిగా సీఎం తీర్మానంపై ప్రసంగించారు. మండలి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సీఎం అన్నారు. ప్రజాధనం అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. ఇక తీర్మానంకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. అనంతరం డివిజన్ ఓటింగ్ జరిగింది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ సభలో సభ్యులు కానందున వేరుగా కూర్చోవాలని స్పీకర్ సూచించారు. తీర్మానంకు 133 మంది అనుకూలంగా ఓటు వేశారు.9 మంది మాత్రం న్యూట్రల్గా ఉన్నారు. మెజార్టీ సభ్యులు తీర్మానంకు అనుకూలంగా ఓటు వేసినందున తీర్మానం పాస్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. ఇక అసెంబ్లీలో ఆమోదం పొందిన తీర్మానంను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయనుంది.
సోమవారం శాసనసభ జరిగిన తీరు మినిట్ - టూ-మినిట్ అప్డేట్స్