రాజధాని నిర్మాణంపై లీకులు కాకుండా నివేదిక బహిర్గతం చేయాలి.. రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం , అధికారిక వికేంద్రీకరణపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీతోపాటు , బీజేపీ, జనసేనకు తోడు వామపక్ష పార్టీలు కూడ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
దీంతో సీపీఎం పోలీట్ బ్యూరో సభ్యుడు పార్టీ సినియర్ నేత రాఘవులు రాజధాని మార్పుపై స్పందించారు . రాజధాని తరలింపు తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు . దీంతో రాజధాని నిర్మాణాన్ని అమరావతిలోనే కొనసాగించాలని రాఘవులు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, కార్యానిర్వాహక వ్యవస్థులు వేర్వేరుగా ఉండడం వల్ల పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రకటన సైరంది కాదని అన్నారు. కాగా రాజధాని నిర్మాణంపై జీఏన్ రావు కమిటీ నివేదికపై ముఖ్యమంత్రి లీకులు ఇవ్వకుండా పూర్తిగా నివేదికను బహిర్గతం చేయాలని ఆయన సూచించారు. రాజధాని నిర్మాణం అనేది రాజధాని కోణంలో కాకుండా ప్రజల కోణంలో చూడాలని ఆయన సూచించారు. ఇక ఈ నిర్ణయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసువాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.