విజయవాడ: ఒలంపిక్స్ లో గెలువు నోబెల్ బహుమతిని ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకామ్ ఫిజిక్స్ చదివానని చేసిన ప్రకటన తరహలోనే బాబు వ్యాఖ్యలు అనిపిస్తున్నాయనే సెటైర్లు విన్పిస్తున్నాయి.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ ను ఏపీ ప్రభుత్వం బుదవారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించింది ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు వింతగొలుపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాదు ఈ వ్యాఖ్యల పట్ల తలోరకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మన పిల్లలు ఒలంపిక్స్ లో కూడ గెలవాలి. గెలిచేవరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటిస్థానంలో వస్తే నేను ఇటీవలే అనౌన్స్ చేశాను. నోబెల్ ప్రైజ్ కూడ అనౌన్స్ చేశాను. అదే మాదిరి బ్రహ్మండమైన సన్మానం చేయాలనేది నా ఆశ, ఆశయం.
ఇది తప్పకుండా నెరవేరుతోందని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో గెలిస్తే కిదాంబి శ్రీకాంత్ కు నోబెల్ బహుమతిని ఇస్తామంటూ చంద్రబాబునాయుడు ప్రకటించారు.