ఈ చెట్టు కొడితే అంతే!...కాపలా కోసమే ఒక రెవిన్యూ ఉద్యోగి
చిత్తూరు
జిల్లాలో
ఓ
చెట్టు
కోసమే
ఏకంగా
రెవిన్యూ
ఉద్యోగిని
కాపలా
పెట్టారు.
అతడి
పనల్లా
ఆ
చెట్టును
ఎవరూ
కొట్టకుండా
24
గంటలూ
కాపలా
కాయడమే...
ఇంతకీ
ఏంటి
ఆ
చెట్టు
స్పెషల్...ఎందుకు
ఆ
చెట్టు
కాపలా
కోసం
ప్రత్యేకించి
ఒక
ఉద్యోగిని
కాపలా
పెట్టారంటే...
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నడుంపల్లి గ్రామంలో ఉన్న ఈ మర్రి చెట్టు వయస్సు 80 ఏళ్లు. దశాబ్దాలుగా పెరిగి ఊడలు దిగుతూ విస్తరించిన ఈ మర్రి చెట్టు గ్రామస్థులకు ఏళ్ల తరబడి చల్లని నీడనిస్తూనే ఉంది. అయితే చల్లటి తల్లి లాంటి ఈ చెట్టు విస్తరించిన ప్రదేశం మీద కొందరు అక్రమార్కుల కన్నుబడింది. దీంతో ఈ గ్రామంలోని ఓ వర్గం వారు ఈ చెట్టును నరికేసి అక్కడ ఓ గుడి కట్టాలని నిర్ణయించారు. ఇటీవలికాలంలో ఆ ప్రయత్నాలు ఆరంభించారు.
అయితే ఆ ఊరులోని ఎక్కువమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కావాలంటే ఈ చెట్టు కింద గుడి కట్టుకోమని, అంతేకాని చెట్టు తీసేసి గుడి కట్టేందుకు ఒప్పుకునేది లేదని...ఈ విషయమై చెట్టును కాపాడాలంటూ అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అయితే ఈ విషయమై అధికారుల నుంచి స్పందన లేకపోవడం, చెట్టు కొట్టే ప్రయత్నాలు కొనసాగుతుండటంతో ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీంతో
ఈ
చెట్టును
కొట్టేయడానికి
వీల్లేదని
హైకోర్టు
తీర్పు
ఇచ్చింది.
ఈ
చెట్టును
ఎవరైనా
కొట్టేస్తే
నాన్
బెయిలబుల్
కేసు
అవుతుందని
హెచ్చరించింది.
ఈ
నేపథ్యంలో
జిల్లా
న్యాయవాదులు
గ్రామ
పరిస్థితి,
గ్రామంలో
ఈ
చెట్టు
పరిస్థితిని
పరిశీలించి
ప్రత్యేకించి
ఈ
చెట్టు
కాపలా
కోసమే
దీని
వద్ద
ఒక
వీఆర్ఏను
కాపలాగా
పెట్టారు.
ఆయన
పనల్లా
ఈ
చెట్టును
కొట్టేందుకు
ఎవరూ
రాకుండా
చూడటమే!...