వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు ! రెండ్రోజులు ముందుగానే ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా... రెండు రోజులు ముందుగానే వెళ్లేందుకు సిద్ధంకావడం ఉత్కంఠ రేపుతోంది.

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమవుతోంది. ఇందులో పలు కీలక అంశాలపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఢిల్లీకి సీఎం జగన్

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న జగన్, ఆ టూర్ ను కాస్త ముందుకు జరుపుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని కీలక పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ను ముందుకు జరుపుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవాళ మధ్యాహ్నం గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయన సడన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది.

పొన్నూరు, హైదరాబాద్ టూర్లు రద్దు

పొన్నూరు, హైదరాబాద్ టూర్లు రద్దు

వాస్తవానికి సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరు, అలాగే హైదరాబాద్ లో టూర్లు ప్లాన్ చేసుకున్నారు. వీటిని అర్ధాంతరంగా రద్దుచేసుకున్నట్లు నిన్న రాత్రి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. దీంతో సీఎం జగన్ ఈ రెండు టూర్లు ఇంత అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ఇందులో సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెళ్లేందుకే ఈ రెండు టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్లు రద్దు చేసుకున్న జగన్ ఉదయం మాత్రం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశాఖపై సమీక్ష మాత్రం కొనసాగిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి జగన్ ఢిల్లీ పయనం అవుతారని తెలుస్తోంది.

రాష్ట్రంలో తాజా పరిణామాలతో ?

రాష్ట్రంలో తాజా పరిణామాలతో ?

తాజాగా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ఢిల్లీ పెద్దలతో అత్యవసరంగా చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. అందుకే ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లాల్సిన జగన్ రెండు రోజుల ముందుగానే కేంద్రంలో పెద్దల్ని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకే చివరి నిమిషంలో తన షెడ్యూల్డ్ టూర్లు రద్దు చేసుకుని హస్తిన బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ నుంచి అపాయింట్ మెంట్ ఖరారైతే జగన్ టూర్ ఖరారవుతుంది.

English summary
ap cm ys jagan likely to go to delhi today to meet delhi bjp bosses amid cbi notices to brother, kadapa mp ys avinash reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X