వారం రోజుల పాటు అమేరికాలో పర్యటించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారం రోజుల పాటు విదేశీ యానం చేయనున్నారు. ఈనెల 15 నుండి 24 వరకు ఆమేరికా పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. కాగా కుటుంభ సభ్యులతో కలిసి వెళ్లనున్న ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హజరైన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకోనున్నారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి అమేరికా వెళ్లనున్నారు.
15 సాయత్రం అమేరికా వెళ్లనున్న జగన్ మోహన్ రెడ్డి కుటుంభం,ఆయన చిన్న కుమార్తే వర్షారెడ్డిని అమేరికాలోని గ్రాడ్యుయోషన్ కోర్సులో చేర్పించనున్నారు. అనంతరం 17న డాలస్లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్లో ఉత్తర అమెరికాలోని ప్రవాసాంధ్రులతో జరిగే ఆత్మీయ సమావేశంలో పాల్గొంటున్నట్టు సమాచారం.
అయితే మొత్తం 8 రోజులపాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమేరికాలో పలు ప్రాంతాలు సందర్శించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగంగానే పలువురు స్థానికులతో సమావేశం అనంతరం తిరిగి ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్కు చేరుకోనున్నట్టు పార్టీ వర్టాలు వెల్లడించాయి.