వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 వేలకు దిగువన ఏపీ కోవిడ్ కేసులు- 58 మరణాలు- గత 24 గంటల్లో

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతోంది. అయితే పలు జిల్లాల్లో మాత్రం కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 6952 కొత్త కేసులు నమోదయ్యాయి. 58 మంది కరోనాతో చనిపోయారు. ప్రభుత్వం 24 గంటల్లో లక్షా 8 వేల శాంపిల్స్‌ను పరీక్షించింది. 11577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్ని గమనిస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1199 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 1167 కేసులు వెలుగుచూశాయి. మిగతా జిల్లాల్లో పరిస్ధితి అదుపులోనే ఉంది. పశ్చిమగోదావరిలో 663, ప్రకాశం 552, అనంతపురం 550, కడప 456, విశాఖ 436, గుంటూరు 426, కృష్ణా 392, శ్రీకాకుళం 383, కర్నూలు 251, విజయనగరం 249, నెల్లూరు 228 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో 18 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 17 లక్షల మంది కోలుకున్నారు. మరో 90 వేల యాక్టివ్‌ కేసులున్నాయి.

ap covid daily cases below 7k, 58 deaths recorded in last 24 hours

మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో చనిపోయారు. చిత్తూరులో 9, తూర్పుగోదావరిలో 6, అనంతపూర్‌లో 5, కృష్ణాలో 5, విశాఖలో 5, శ్రీకాకుళంలో 4, పశ్చిమగోదావరిలో 4, కర్నూల్లో 3, గుంటూరులో 2, విజయనగరంలో 2, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించారు. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 11882 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

English summary
andhrapradesh records near 7000 new covid infections and 58 deaths in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X