వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరింత తగ్గిన కరోనా- 5674 కొత్త కేసులు- 45 మరణాలు-తూర్పున అదే కల్లోలం

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం 6 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో లక్షకు పైగా కరోనా పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో 5674 కొత్త కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి.

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్ని గమనిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1068 కొత్త కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో మాత్రం వెయ్యి కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. చిత్తూరులో 854, పశ్చిమగోదావరిలో 758, ప్రకాశం 451, కృష్ణాలో 435, కడపలో 388, గుంటూరులో 360, అనంతపురం 326, శ్రీకాకుళంలో 245, నెల్లూరులో 235, విశాఖ 215, కర్నూలు 173, విజయనగరం 166 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో 18.44 లక్షల పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో 17.67 లక్షల మంది కోలుకున్నారు. మరో 65 వేల యాక్టివ్ కేసులున్నాయి.

ap covid update : 5674 new cases and 45 deaths recorded in last 24 hours

మరణాల విషయానికొస్తే అత్యధికంగా చిత్తూరులో 9 మంది కరోనాతో చనిపోయారు. తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూల్లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 12269కి చేరింది. గత 24 గంటల్లో 8014 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

English summary
andhrpradesh records more than 5674 new covid 19 cases and 45 deaths in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X