ఒకేరోజు 8మంది మినిస్టర్స్, పక్కన కృష్ణంరాజు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదివారాల్లో బోసిపోయి ఉండే సచివాలయం ఈ ఆదివారం (22వ తేదీ) మాత్రం సందడిగా కనిపించింది. ఒకేరోజు ఎనిమిది మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. మంత్రుల బాధ్యత స్వీకరణకు ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై అయిదు నిమిషాల నుండు ముహూర్తాలు కుదిరాయి.
కొద్ది నిమిషాల తేడాల్లోనే ఎక్కువమంది కార్యాలయాల్లోకి ప్రవేశించారు. ఉప ముఖ్యమంత్రులు చిన రాజప్ప, కెఈ కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు. జె బ్లాక్లో నలుగురు మంత్రులు, హెచ్ బ్లాక్లో ముగ్గురు, ఎల్ బ్లాక్లో ఒకరు బాధ్యతలు చేపట్టారు. వీరు బాధ్యతలు స్వీకరించే కార్యాలయాలను పూలతో ముస్తాబు చేశారు. ముహుర్తానికి కొద్ది ముందే వచ్చిన మంత్రులు తమ వాహనాల్లోనో, సహచర మంత్రుల కార్యాలయాల్లోనే కూర్చున్నారు.
పూజల తర్వాత తొలి సంతకం చేశారు. వారిని అభినందించేందుకు చాలామంది తరలి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వారిలో చిన రాజప్ప, కెఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, మృణాళిని, శిద్దా రాఘవ రావు, పీతల సుజాత, మాణిక్యాల రావు, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.
పల్లె రఘునాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం మంచి ముహూర్తం ఉండటంతో మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలోకి గృహప్రవేశం చేస్తున్న దృశ్యం.
అయ్యన్నపాత్రుడు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న అయ్యన్న పాత్రుడు.
కెఈ కృష్ణమూర్తి
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న కెఈ కృష్ణమూర్తి.
మృణాళిని
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న మృణాళిని.
మృణాళిని
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. మృణాళినికి మిఠాయి తినిపిస్తూ...
చిన రాజప్ప
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న చినరాజప్ప
చిన రాజప్ప
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న చినరాజప్ప
మాణిక్యాల రావు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు. పక్కన బిజెపి సీనియర్ నేత కృష్ణం రాజు.
పత్తిపాటి పుల్లారావు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న పత్తిపాటి పుల్లారావు.
పత్తిపాటి పుల్లారావు
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. పుల్లారావుకు మిఠాయి తినిపిస్తూ....
పీతల సుజాత
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న పీతల సుజాత.
పీతల సుజాత
ఆదివారం ఉదయం మంచి ముహూర్తం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమిది మంది ఎపి మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. సుజాతకు అభినందనలు. కాగా మరో మంత్రి శిద్దా రాఘవ రావు కూడా బాధ్యతలు స్వీకరించారు.