వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాస్పద బుక్: కంచ ఐలయ్యపై కేసు నమోదుకు డీజీపీ ఆదేశం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రాసి కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐలయ్యపై కేసు నమోదు చేయాలంటూ డీజీపీ సాంబశివరావు సీఐడీ అధికారులను ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రచించారని, తమను స్మగ్లర్లుగా పేర్కొన్నారని ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు.

AP DGP ordered file a case against kancha ilaiah

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరో వైపు ఈ పుస్తకాన్ని నిషేధించాలని, ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Andhra Pradesh DGP Sambasiva Rao ordered file a case against Prof. Kancha Ilaiah for his controversy book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X