నేడే ఏపీ ఎంసెట్ ఫలితాలు: ఈ వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా కాకినాడ జేఎన్టీయూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు.
ఏపీ ఎంసెట్ ఆన్ లైన్ విధాంలో నిర్వహించారు. లక్షా 99వేల మంది పరీక్షలు రాస్తే, లక్షా 38వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 137 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు.
ఎంసెట్ ఫలితాల కోసం sche.ap.gov.in, www.sche.ap.gov.in/eamcet, www.vidyavision.com, www.manabadi.com, www.manabadi.co.in and www.schools9.com వెబ్సైట్లను సందర్శించవచ్చు.
కాగా, ఎంసెట్ ఫలితాలు టీవి స్క్రీన్ పై కూడా కనిపించనున్నాయి.
ఏపీ ఫైబర్నెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలు ఎంసెట్ విద్యార్థుల కోసం ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల టీవి స్క్రీన్ పై ఫలితాలకు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ టైప్ చేస్తే ఫలితాలు తెలుసుకోవచ్చు.