వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..

|
Google Oneindia TeluguNews

ప్రతినెలా ఠంచనుగా ఒకటో తారీఖున జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు.. రోజులు గడుస్తున్నా వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించనందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్న ప్రభుత్వం.. మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతోంది. చంద్రబాబు వక్రబుద్ధి వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అధికార వైసీపీ మండిపడింది.

ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారు అజేయ కల్లం వివరణ ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలి ఆమోదం లభించకపోవడమే దీనికి కారణమని, జూన్ 30 వరకు ఖర్చులను కూడా గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా చేపట్టామని, జులై ఖర్చులకు సంబంధించి మరోసారి గవర్నర్ ఆమోదంతో సమస్యను పరిష్కరించుకుంటామని, అందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుందని కల్లం తెలిపారు.

ap employees did not get salaries, govt explains reasons, vijaya sai slams chandrababu

రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. శాసనసభ పాస్ చేసిన ద్రవ్య బిల్లు.. మండలిలోనూ ఆమోదం పొంది, తిరిగి శాసనసభకు రాకపోతే.. 14 రోజుల తర్వాతే ఆ బిల్లును అసెంబ్లీ కార్యదర్శే గవర్నర్ కు పంపే వీలుందని, జూన్ 17న మండలిలో ద్రవ్య బిల్లు పెండింగ్ లో పడిపోయిన దరిమిలా బుధవారం(జులై 1) నాటికి 14 రోజుల గడువు పూర్తయిందని, ప్రస్తుతం గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నదని అజేయ కల్లం వివరించారు.

Recommended Video

యూపీ స్కూల్ టీచర్ రూ.కోటి స్కాం కొత్త మలుపు...!!

ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విటర్ లో స్పందించారు. ఉద్యోగులకు వేతనాలు అందకపోవడానికి కారణం టీడీపీ చీఫ్ చంద్రబాబేనని దుయ్యబట్టారు. ''ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకోవడం ద్వారా ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ప్రజలు బుద్ది చెప్పినా తన వక్రబుద్ధి మార్చుకోకుండా.. ప్రజలపైనే కక్ష సాధిస్తున్నాడు. మండలి ఆమోదం అవసరం లేదు.. చంద్రబాబు మోకాలు అడ్డాడు అంతే. ఇంకో మూడు రోజుల్లో సమస్య తొలగిపోతుంది''అని ఎంపీ పేర్కొన్నారు.

English summary
Andhra Pradesh govt employees did not get their monthly salaries even after july 2nd. govt advisor ajeya kallam explains the reasons behind it. ysrcp mp vijaya sai reddy slams chandrababu for the delay of salaries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X