కరోనా కబలింపు: ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ మృతి, 10 రోజులుగా చికిత్స, పలువురి సంతాపం..
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయితే మరణాలు కూడా రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులును కరోనా కబలించంది. వైరస్ సోకి ఆయన తెల్లవారుజామును మృతిచెందారు. కరోనా వైరస్ రావడంతో పది రోజుల నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం ఐదు గంటలకు రామాంజనేయులు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు.. కాగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తొలి చైర్మన్గా చలమలశెట్టి రామాంజనేయులను నియమించారు. రామాంజనేయులు మృతిపై మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Recommended Video
చలమలశెట్టి రామాంజనేయులు మృతిపై చంద్రబాబు సంతాపం తెలిపారు. గత ప్రభుత్వ భయాంలో కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్గా ఉత్తమ సేవలు అందించారని గుర్తుచేశారు. పార్టీకి, కాపుల పురోగతి కోసం ఆయన పునరంకితం అయ్యారని తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టిడిపి సీనియర్ నేత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ్య గారి మృతి విచారకరం.
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 11, 2020
కాపు కార్పోరేషన్ ద్వారా ఎంతోమంది కాపు సోదరులకు అండగా నిలిచిన వ్యక్తి ఆయన. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తన చివరి శ్వాస వరకూ ప్రజాసేవే ఊపిరిగా జీవించారు. pic.twitter.com/9uCFztp9Gs
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేశాక తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి రామానుజయగారి మరణం విచారకరం. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. pic.twitter.com/UtYk3jftap
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 11, 2020
చలమలశెట్టి మృతిపై నారా లోకేశ్ కూడా విచారం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం చివరి శ్వాసం వరకు పనిచేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.