ఆయన ఓ మాజీ మంత్రి... అయినా నోటా కంటే తక్కువ ఓట్లు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ విజయంలో ప్రతిపక్షపార్టీలు ఘోరంగా మట్టికరిచిన విషయం తెలిసిందే..అధికార టీడీపీ పార్టీకి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీకి 23 సీట్లను కైవసం చేసుకుని చావుతప్పి కన్నులోట్ట పోయినట్టుగా తయారైంది.
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయితే మరి ఘొరంగా తయారైంది..కొంతమంది నాయకులకు కనీసం నోటాకు వచ్చిన ఓట్లు రాని పరిస్థితి ఉంది. అదికూడ మాములు నాయకులకు కాదు..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి శైలాజా నాథ్కు ఈ పరిస్థితి ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే మాజీమంత్రి శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఈయనకు వచ్చిన ఓట్లు చూస్తే మాత్రం దిమ్మతిరిగి పోతుంది. శైలజానాథ్కు మొత్తం 1384 ఓట్లు వచ్చాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆ నియోజకవర్గంలో నోటాకు కూడ 2340 ఓట్లు వచ్చాయి. ఇక నోటాకంటే తక్కువ రావడం అదికూడ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి రావడంతో అందరు చర్చించుకుంటున్నారు.