కనిగిరి ఘటన: కలెక్టర్ను నివేదిక కోరిన ప్రభుత్వం
ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. డిగ్రీ విద్యార్థినిపై సహచర విద్యార్థులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. అంతేకాదు ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.
ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?
ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన చోటుచేసుకొన్న ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, అత్యాచారయత్నానికి గురైన బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.బాధితరాలికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు.
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్
కనిగిరిలో స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. యువతి ప్రతిఘటిస్తున్నా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.