ఏపీ ప్రభుత్వ చీఫ్ పల్లెకు సతీవినియోగం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి ఉమ దేవి గురువారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమ మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలువురు పల్లెను పరామర్శించారు.
పల్లె రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు అన్ని విధాలా ఆమె అండగా ఉన్నారు. గతంలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె పోటీ చేసినప్పుడు రెండుసార్లు ప్రచారం చేశారు. అనంతపురంలో పల్లెకు ఉన్న విద్యా సంస్థల లావాదేవీలను ఉమ చూసుకునేవారు.
బాలాజీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ను స్థాపించారు. వాటిని చూసుకునేవారు. పల్లె ఉమ మృతిపై ఆ విద్యాసంస్థలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు, పుట్టపర్తివాసులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు పేద విద్యార్థులకు సాయం చేశారు.