పేదలకు ఏపీ ప్రభుత్వం వరం.. ఇళ్ల స్థలాల పంపిణికి రంగం సిద్ధం.. ఏ రోజునంటే!
ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ ప్రక్రియ ఇవాళ మొదలైంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరికి ఏ స్ధలం ఇవ్వాలో నిర్ణయించేందుకు అధికారులు ఇవాళ్టి నుంచి జిల్లాల్లో డ్రాలు నిర్వహిస్తారు. చివరిగా ఈనెల 25న ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాలను అందచేస్తారు.
ఏపీలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ
ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఇవాళ జీవో జారీ చేసింది. దీని ప్రకారం నేటి నుంచి పేదల ప్లాట్ల కేటాయింపుల ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. దీని ప్రకారం అధికారులు లబ్ధిదారుల ఎంపిక కోసం అన్ని జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు.
ఈ నెల 15 నుంచి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్
ఈనెల
15
నుంచి
లబ్ధిదారుల
పేర్ల
మీద
ప్లాట్ల
రిజిస్ట్రేషన్
చేపట్టనున్నారు.
చివరిగా
ఉగాదిరోజున
అంటే
ఈ
నెల
25న
ప్లాట్లను
లబ్ధిదారులకు
అందజేయాలని
ప్రభుత్వం
తన
ఉత్తర్వుల్లో
పేర్కొంది.
లబ్ధిదారులకు
పూర్తిగా
లే
అవుట్
వేసిన
ప్లాట్లను
అప్పగించాలని
ఆదేశాల్లో
పేర్కొన్నారు.