వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదలకు ఏపీ ప్రభుత్వం వరం.. ఇళ్ల స్థలాల పంపిణికి రంగం సిద్ధం.. ఏ రోజునంటే!

|
Google Oneindia TeluguNews

ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ ప్రక్రియ ఇవాళ మొదలైంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరికి ఏ స్ధలం ఇవ్వాలో నిర్ణయించేందుకు అధికారులు ఇవాళ్టి నుంచి జిల్లాల్లో డ్రాలు నిర్వహిస్తారు. చివరిగా ఈనెల 25న ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాలను అందచేస్తారు.

ఏపీలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ

ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఇవాళ జీవో జారీ చేసింది. దీని ప్రకారం నేటి నుంచి పేదల ప్లాట్ల కేటాయింపుల ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. దీని ప్రకారం అధికారులు లబ్ధిదారుల ఎంపిక కోసం అన్ని జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు.

Ap government initiates process for distribution of plots for poor

ఈ నెల 15 నుంచి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్

ఈనెల 15 నుంచి లబ్ధిదారుల పేర్ల మీద ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేపట్టనున్నారు. చివరిగా ఉగాదిరోజున అంటే ఈ నెల 25న ప్లాట్లను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
లబ్ధిదారులకు పూర్తిగా లే అవుట్ వేసిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

English summary
Ap Govt started the process of distributing House sites to the poor. Ap govt issued orders to start the process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X