వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా టెస్టింగ్ నుంచి ట్రీట్‌మెంట్ వరకు అన్నీ అబద్దాలే, జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ ఫైర్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పరీక్షల నుంచి అందించే వైద్యం వరకు అన్నీ అబద్దాలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఓ కుటుంబం పడుతున్న వీడియోను ట్వీట్ చేశారు. కరోనా వైరస్ పెద్ద విషయం కాదనే నిర్లక్ష్య ధోరణిని ఏపీ సర్కార్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

అనంతపురం అశోక్ నగర్‌కి చెందిన భవానీ శంకర్ కుటుంబంతో ఉంటున్నారు. ఇతనికి తల్లి, తండ్రి ఉన్నారు. సోదరి, ఆమె కూతురు కూడా ఇతనితోనే ఉంటున్నారు. అయితే ఈ ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. కానీ ఇంటికి పంపించగా.. వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు. రెండురోజుల నుంచి తమను పట్టించుకోవడం లేదు అని భవానీశంకర్ వాపోయారు.

ap government lies on poor people corona treatment..

అంబులెన్స్ కోసం ఫోన్ చేసి చేసి ఆలసిపోయామని భవానీ శంకర్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేయగా.. దానిని లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ పార్టీ నేతల వైద్యం కోసం హైదరాబాద్ పంపిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. పేదలు అనేసరికి ఆస్పత్రుల్లో బెడ్స్ లేవని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.

English summary
andhra pradesh government lies on poor people corona treatment nara lokesh alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X