కరోనా టెస్టింగ్ నుంచి ట్రీట్మెంట్ వరకు అన్నీ అబద్దాలే, జగన్ సర్కార్పై నారా లోకేశ్ ఫైర్ (వీడియో)
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పరీక్షల నుంచి అందించే వైద్యం వరకు అన్నీ అబద్దాలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఓ కుటుంబం పడుతున్న వీడియోను ట్వీట్ చేశారు. కరోనా వైరస్ పెద్ద విషయం కాదనే నిర్లక్ష్య ధోరణిని ఏపీ సర్కార్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
అనంతపురం అశోక్ నగర్కి చెందిన భవానీ శంకర్ కుటుంబంతో ఉంటున్నారు. ఇతనికి తల్లి, తండ్రి ఉన్నారు. సోదరి, ఆమె కూతురు కూడా ఇతనితోనే ఉంటున్నారు. అయితే ఈ ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. కానీ ఇంటికి పంపించగా.. వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు. రెండురోజుల నుంచి తమను పట్టించుకోవడం లేదు అని భవానీశంకర్ వాపోయారు.
టెస్టింగ్ నుండి ట్రీట్మెంట్ వరకూ అన్నీ అబద్దాలే. కరోనా పెద్ద విషయం కాదన్న రోజునుండి అదే నిర్లక్ష్య ధోరణి. అనంతపురం, అశోక్ నగర్ కి చెందిన భవాని శంకర్ కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ అని చెప్పి ఇంటికి పంపారు.(1/2)#CoronaCrisisInAP#SaveAndhraPradesh pic.twitter.com/q2ntP0VzmJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 22, 2020
వస్తుందన్న అంబులెన్స్ అడ్రెస్ లేదు, పట్టించుకున్న నాధుడు లేడు. రెండు రోజులుగా కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణణాతీతం. ప్రజలకి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవంటూ గాలికొదిలేస్తున్న @ysjagan ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు,నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తోంది.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 22, 2020
అంబులెన్స్ కోసం ఫోన్ చేసి చేసి ఆలసిపోయామని భవానీ శంకర్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేయగా.. దానిని లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ పార్టీ నేతల వైద్యం కోసం హైదరాబాద్ పంపిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. పేదలు అనేసరికి ఆస్పత్రుల్లో బెడ్స్ లేవని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.