ఆ ఉద్యోగులపై ఏపీ సర్కార్ రివర్స్ అస్త్రం: జీతాలు తిరిగి ఇవ్వాలంటూ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్ ఉద్యోగుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశారు . ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు పెంచి వారి అభివృద్ధికి ప్రభుత్వం దోహద పడుతున్న సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఊహించని విధంగా మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్నా మొన్నటి దాకా వివిధ ప్రాజెక్ట్ లు, అభివృద్ధి పనుల విషయంలోనే రివర్స్ అస్త్రం ప్రయోగించిన సర్కార్ ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కూడా ప్రయోగిస్తుంది.
'కియా'లో ఏం జరుగుతోంది? ఛేజ్ చేసిమరీ రామకృష్ణ అరెస్టా?: చంద్రబాబు మండిపాటు
గత ప్రభుత్వం హయాంలో
ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమశాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం రివర్స్ అస్త్రం ప్రయోగించినట్టు సమాచారం. గత ప్రభుత్వం హయాంలో ఈ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను రూ. 3వేల నుంచి రూ 7వేల రూపాయలకు పెంచారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం వీరిపై రివర్స్ అస్త్రం ప్రయోగించింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన
పెంచిన జీతాలను ఉద్యోగులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. దీంతో స్త్రీశిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఇచ్చి ఇప్పుడు తిరిగి ఇచ్చెయ్యమంటేఎలా అని వారు వాపోతున్నారు. ఇప్పటి వరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
అసలు కారణం ఏంటి అనేది
అంతపెద్ద మొత్తంలో డబ్బును ఇప్పుడు ఎక్కడినుంచి తెచ్చి ఇవ్వాలని ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అనేది కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలీటం లేదు . ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు.