వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీ సర్కారు సంచలన నిర్ణయం- ఆ 20 మంది కోసం ప్రత్యేక ఎంసెట్ పరీక్ష
ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎంసెట్ పరీక్ష పూర్తి కాగా.. గతంలో పరీక్షకు దరఖాస్తు చేసుకుని క్వారంటైన్లో ఉండటం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
గతంలో క్వారంటైన్లో ఉండి ఎంసెట్ రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఆ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. అలాంటి వారు ఏపీ ఎంసెట్ హెల్ప్లైన్ సెంటర్ మెయిల్ ఐడీ '[email protected]' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
English summary
andhra pradesh government has decided to hold a special eamcet for 20 quarantine applicants, who were unable to attend the exam previously.
Story first published: Tuesday, September 29, 2020, 17:03 [IST]