వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి హెడ్‌మాస్టర్‌కి ట్యాబ్: గంటా, ఎస్కేయూ వైస్ ఛాన్సలర్‌గా రాజగోపాల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఏపీలోని ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్‌కి ట్యాబ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలో కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రాంతీయ విద్యా సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడుతూ ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు విద్యలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు నేరుగా పాఠశాలల పనితీరును, సౌకర్యాలను పర్యవేక్షించే పరిస్ధితి వస్తుందని చెప్పారు.

AP govt give laptops for school headmasters

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి రఘునాథ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా కె.రాజగోపాల్‌ నియామకం

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా కె.రాజగోపాల్‌ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Minister Ganta Srinivasa Rao says AP govt ready to give tab for school headmasters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X