వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఈఏపీసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు(ఈఏపీసెట్) ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించింది. ఇప్పటి వరకు ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది.

ఈ ఏడాది ఈఏపీసెట్ 100 శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందున ఈ ఒక్క ఏడాదికే ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

AP GOVT Key decision: inter marks weightage in eapcet removed

ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్)-2021ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు.

Recommended Video

AP Govt : 10% EWS Quota To Govt. Jobs Along With Education || Oneindia Telugu

వైద్య విద్యలో ప్రవేశల కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక పరీక్ష(నీట్) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ఎం అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మా ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నందున ఎం స్థానంలో 'పీ'తీ సదకపసీ ఐఏపీసెట్‌గా మార్పు చేశారు.

English summary
AP GOVT Key decision: inter marks weightage in eapcet removed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X