గౌతమిపుత్ర శాతకర్ణిపై కేబినెట్ చర్చ: లేచి వెళ్లిపోయిన చంద్రబాబు..
తమ మధ్య ఉన్న బంధుత్వం ప్రభావం కేబినెట్ చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో జరిగిన ఈ భేటీలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' పన్ను మినహాయింపు అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే ఈ చర్చ సందర్బంగా సీఎం చంద్రబాబు సమావేశం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
'గౌతమిపుత్ర శాతకర్ణి' హీరో బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడం, పైగా బాలకృష్ణకు చంద్రబాబుకు బంధుత్వం ఉండటంతో.. ఆ ప్రభావం చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
సెక్షన్-8 ప్రకారం సినిమాకు పన్ను రాయితీనిస్తూ కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
*
కర్నూలు
జిల్లా
ఓర్వకల్లులో
గ్రీన్ఫీల్డ్
ఎయిర్పోర్టుకు
638
ఎకరాల
భూమి
ఇవ్వాలని
నిర్ణయం
*
పోలవరం
సబ్
కాంట్రాక్టర్
అయిన
ఎల్అండ్టీ
కంపెనీకి
రూ.95
కోట్లను
ఎస్క్రో
ఖాతా
ద్వారా
చెల్లించేందుకు
ఆమోదముద్ర
*
అనంతపురం
జిల్లాలో
500
మెగావాట్ల
సోలార్
విద్యుత్
ప్రాజెక్టుకు
4018
ఎకరాలు
ఇవ్వాలని
నిర్ణయం
*
ఏపీ
అసెంబ్లీ
భవన
ప్రారంభోత్సవానికి
ప్రధాని
మోదీని
ఆహ్వానించాలని
నిర్ణయం.
*గౌతమీపుత్ర
శాతకర్ణి
సినిమాకు
ఆంధ్రప్రదేశ్లో
వినోదపన్ను
మినహాయింపు