రేవంత్ ఎఫెక్ట్: వారికి బాబు ఉద్వాసన చెబుతారా, కేసీఆర్ను స్టీఫెన్ కలిశారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధను బాధ్యతల నుండి తప్పిస్తారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాన్ని పసిగట్టడంలో విఫలమైనందుకు ఆమెను తప్పించవచ్చునని వార్తలు వస్తున్నాయి. నిరుడు జూన్ 8వ తేదీన 2014న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అనురాధను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు.
ఏం జరిగింది!?
ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు నోటుకు ఓటు వ్యవహారంపై అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మే 27వ తేదీన ముడుపుల వ్యవహారంలో కీలకమైన స్టీపెన్ సన్, మంత్రి హరీష్ రావులు తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారని తెలుస్తోంది. దాని గురించి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని భావిస్తున్నారని తెలుస్తోంది.
తెరాస వ్యూహంలో భాగంగా స్టీపెన్ సన్ నివాసంలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు.