ఏపీలో మరోసారి ఐపీఎస్ల బదిలీ.. ఈసారి పదకొండు..!
అమరావతి : ఏపీలో మరోసారి పలువురు ఐపీఎస్ల బదిలీ జరిగింది. సీనియర్, జూనియర్ హోదా స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ హోదాలో నలుగురు ఐపీఎస్లు ఉండగా, జూనియర్ హోదాలో ఏడుగురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీనియర్ హోదాలో ఉన్న నలుగురు ఐపీఎస్లకు స్థానచలనం కలిగింది. దాంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏడీజీగా కృపానంద్ త్రిపాఠి ఉజేలా.. లీగల్ మెట్రాలజీ కంట్రోలర్గా కాంతారావు.. SPF డీజీగా టీఎ త్రిపాఠి.. హోంగార్డ్స్ అదనపు డీజీగా హరీష్ కుమార్ గుప్తాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు.
పోలీస్కు మందుబాబు "ముద్దు".. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే అనుకున్నాడేమో..! (వీడియో)
అదే క్రమంలో జూనియర్ హోదా స్థాయి ఐపీఎస్లైన ఏడుగురికి స్థానచలనం కలిగింది. రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్.. నర్సీపట్నం ఏఎస్పీగా రిషాంత్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్ వన్గా గరుడ్ సుమిత్ సునీల్ను.. గ్రేహోండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా రాహుల్ దేవ్ సింగ్ను.. బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్ వన్గా గౌతమి శాలిని ని.. విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్గా అజితా వెజెండ్లను.. రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.