లోకేష్పై అచ్చెన్న సంచలనం: సహచర్యం వల్లే ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతి అచ్చెన్నాయుడు టిడిపి కార్యాలయంలో నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో నవ్వులు పూయించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతి అచ్చెన్నాయుడు టిడిపి కార్యాలయంలో నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో నవ్వులు పూయించారు. గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని వర్థంతిగా సంబోంధించి నాలుక కరుచుకొన్నారు. ఆ తర్వాత మంత్రి నారాలోకేష్ సహచర్యంతోనే తాను కూడ ఈ రకంగా మాట్లాడినట్టు చెప్పగానే అందరూ నవ్వారు.
గుంటూరులోని టిడిపి ప్రధాన కార్యాలయంలో గౌతు లచ్చన్న 108వ, జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు లచ్చన్న జయంతికి బదులుగా వర్థంతి అంటూ తప్పుగా చెప్పారు. వెంటనే సభలో పాల్గొన్న టిడిపి నేతలు జరిగిన పొరపాటును మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
వెంటనే సర్ధుకొన్న మంత్రి అచ్చెన్నాయుడు తాను పొరపాటున జయంతికి బదులుగా వర్తంతి అన్నానని చెప్పారు. అయితే నారాలోకేష్ సహచర్యం వల్ల తాను కూడ జయంతికి బదులుగా వర్థంతి అంటూ వ్యాఖ్యానించానని చెప్పడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి.
మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కొత్తలోనే లోకేష్ అంబేద్కర్ జయంతిని వర్థంతిగా చెప్పారు. ఈ విషయమై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.