ఆ అవార్డు జగన్ కే ఇవ్వాలి : లోకేష్ ట్వీట్
ఏపి ప్రతిపక్ష నేత జగన్ పై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా కొన్ని కామెంట్లు చేసారు. పాదయాత్ర లో భాగంగా..జగన్ తన బహిరంగ సభలు నిర్వహించే సమయంలో టిడిపి పై కొన్ని వ్యాఖ్యలు చేసారు. వాటికి స్పందనగా మంత్రి లోకేష్ సైతం జగన్ పై విమర్శలు చేసారు. జగన్ చేస్తున్నవన్నీ డ్రామాలే అంటూ ట్వీట్ చేసారు. జగన్ తన సభలను అడ్డుకోవటానికి టిడిపి ప్రయత్నాలు చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ..జగన్ కు అవార్డులు ఇవ్వాలని కామెంట్ చేసారు.
వైసిపి అధినేత జగన్ కు చెత్తగా నటించినందుకు అవార్డు ఇవ్వాలని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. జగన్ పాదయాత్ర లో భాగంగా..విజయనగరం జిల్లాలో బహిరంగ సభ సమయంలో ఓ మహిళ ప్రసవం కోసం ఆటోలో వెళ్తూ సభా వద్దకు వచ్చి దారి ఇవ్వమని బంధువులు కోరుతారు. ఆ సమయంలో జగన్ ఆటో కు దారి ఇవ్వమని సభకు హాజరైన వారికి సూచిస్తూనే ప్రభుత్వం 108 వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అదే విధంగా..
First it was the 108 drama, followed by the Kodi Kathi drama. Now Cow Drama. If there were awards for badly-acted, flopped dramas, the Opposition Leader would have swept them all! For the time being, pls make do with “Bhaskar Award for Worst Acting.” Standing ovation to you Sir!! pic.twitter.com/XLOZMp3B2u
— Lokesh Nara (@naralokesh) November 22, 2018
విశాఖ ఏయిర్ పోర్టులో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. దీని పై వైసిపి నేతలు టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. టిడిపి నేతలు సైతం ఇదంతా డ్రామా అంటూ తిప్పి కొడుతున్నారు. ఇక, తాజాగా..కురుపాం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఆవు అక్కడకు రావటం తో..జగన్ టిడిపి నేతలు ఆవును కూడా పంపిస్తున్నారని కామెంట్ చేసారు. వీటన్నింటికి సంబంధించి వీడియోలు పోస్టు చేసిన లోకేష్..జగన్ వి డ్రామాలు అంటూ విమర్శించారు.
జగన్ తొలుత 108 డ్రామా చేసారని..తరువాత కోడి కత్తి డ్రామా అని..ఇప్పుడు ఆవు డ్రామా చేస్తున్నారని మండి పడ్డారు. చెత్తగా నటించిన వారికి..తుస్సుమన్న డ్రామాలకు అవార్డులు ఇస్తే అన్ని అవార్డులు ప్రతిపక్ష నేత జగన్ అందుకుం టారని లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జగన్ చెత్త నటనకు భాస్కర్ అవార్డు ఇవ్వాలని సూచించారు.