వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సదావర్తిపై మాణిక్యాల రావు ఇలా: ‘ఐలయ్య సారీ చెప్పాల్సిందే’

సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆ తీర్పు వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్లు రూ.1300 కోట్లు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వేలంలో పాల్గొనకపోతే రూ.15 కోట్లు జప్తు చేస్తామని రామకృష్ణారెడ్డికి సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

 AP minister Manikyala Rao welcomes SC judgement on Sadavarti lands

ఇది ఇలావుంటే.. త్వరలో 'గుండె గుండెకి బీజేపీ' నినాదంతో ప్రజల్లోకి వెళతామని మాణిక్యాలరావు తెలిపారు. ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆచార్య కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై మాణిక్యాలరావు స్పందించారు.

ఆర్యవైశ్యులకు కంచ ఐలయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. ఒక కులాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని కోరుతున్నట్లు చెప్పారు.

English summary
Minister Manikyala Rao, welcomed Supreme Court (SC) judgement on Sadavarti lands. He hoped that the lands will fetch Rs. 13,000 crores, as demanded by YSRCP leaders. Welcoming the decision of the court, he hailed the decision for more scope to auction the lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X