వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు కాళ్లు భూమి మీద ఆనలే, కళ్లు నెత్తికెక్కాయి: చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విసుర్లు

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సమయంలో అపద్దర్మ ముఖ్యమంత్రి మీరు వ్యవహరించిన తీరు ఏంటీ అని అడిగారు. ఇప్పుడు నీతులు చెబుతారా అని మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సంఘం వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని మాత్రమే చెప్పారు.. తప్పా మరొ మాట మాట్లాడలేదన్నారు. ఈసీ రమేశ్ కుమార్ చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయారా అనే సస్పెక్ట్ మాత్రం వ్యక్తం చేశారని తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాళ్లు భూమి మీద అనలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. కళ్లు తలపై ఉన్నాయని.. ఇప్పుడు మాత్రం సూక్తులు చెబుతున్నారని మండిపడ్డారు. పైగా ఈసీని సీఎం దూషించినట్టు ప్రచారం చేస్తున్నారని.. ఇది సరికాదన్నారు. లేని కామెంట్లను అన్నట్టు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. చంద్రబాబు మాయలో ఈసీ పనిచేస్తున్నారా అని మాత్రమే సీఎం అనుమానం వ్యక్తం చేశారని వివరించారు.

ap minister perni nani angry on chandrababu naidu

Recommended Video

5 Minutes 10 Headlines || Coronavirus Updates || Madhya Pradesh Floor Test || Modi On COVID-19

గత ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు నాయుడు దూషించిన విధానాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. వీడియోలు చూపించాలా అని అడిగారు. ప్రధాని మోడీకి లింక్ పెట్టి చేసిన కామెంట్లు మరచిపోయారా అని అడిగారు. మోడీ ఏమన్నా చేస్తారా..? తమాషాలు చేస్తున్నారా...? మోడీ సంగతి కూడా చూస్తా.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా అని అనలేదా అని గుర్తుచేశారు. అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేదిపై నోరు పారేసుకోలేదా అని అడిగారు. ఇప్పుడేమో శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.

English summary
ap minister perni nani angry on chandrababu naidu on local body election postpone issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X